పదోతరగతి విద్యార్థినిపై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి  

Tenth Class Student Attacked By Thugs With Blade In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కాట్రేనికోడ మండలంలోని చెయ్యేరుకి చెందిన పదోతరగతి విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగులు బ్లేడుతో దాడి చేశారు. విద్యార్థిని పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు విద్యార్థినిపై బ్లేడుతో దాడికి దిగారు. వారి నుంచి తప్పించుకొని విద్యార్థిని పాఠశాలలోకి పరుగెత్తింది.​ దీంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విద్యార్థిని చేతికి స్వల్ప గాయాలయ్యాయని, దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top