కలకలం :  స్కూల్‌ ఎదుటే బాలిక కిడ్నాప్‌

Student Kidnapped In Front Of The School In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో బాలిక కిడ్నాప్‌ కలకలం రేపింది. ఆగిరిపల్లి ఎస్వీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థి లీలా ప్రసాద్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. స్కూల్‌ బయటకు వచ్చిన బాలికను బైక్‌పై వచ్చిన దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. ఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు, స్కూల్‌ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top