తల్లితో గొడవ పడుతున్నాడని కన్న తండ్రిని.. | Son Kills Father In East Godavari | Sakshi
Sakshi News home page

తల్లితో గొడవ పడుతున్నాడని కన్న తండ్రిని..

Jan 6 2019 11:34 AM | Updated on Jan 6 2019 11:35 AM

Son Kills Father In East Godavari - Sakshi

కొడుకు చేతిలో హత్యకు గురైన తండ్రి చిన్నబాబు (48)

పి.గన్నవరం: క్షణికావేశంలో కన్న తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన పి.గన్నవరం మండలంలోని ఎల్‌.గన్నవరం శివారు నడిగాడిలో శనివారం చోటుచేసుకుంది. తల్లిని కొట్టడానికి వస్తున్నాడన్న కోపంతో.. తండ్రి తలపై కుమారుడు కర్రతో కొట్టడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పి.గన్నవరం ఏఎస్సై కేఎస్‌వీఎస్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నడిగాడికి చెందిన యన్నాబత్తుల చిన్నబాబు (48) కొబ్బరి దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం భర్త చిన్నబాబు రేషన్‌ బియ్యం పట్టుకు వచ్చి భార్యను పిలిచి అన్న పెట్టమన్నాడు. అందుకు ‘నువ్వు ఏమైనా జమీందారువా, అన్నం పెట్టుకుని తిను’ అని భార్య సమాధానం ఇచ్చింది.

దీంతో కోపోద్రిక్తుడైన చిన్నబాబు కొట్టడానికి వెళ్లడంతో చిన్నకొడుకు అరుణ్‌ కుమార్‌ అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఆగ్రహించిన అరుణ్‌కుమార్‌ కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తండ్రి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఏఎస్సై ప్రసాద్‌ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement