గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | selling ganja..two arrest | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

Feb 28 2018 9:28 AM | Updated on Oct 17 2018 6:10 PM

selling ganja..two arrest - Sakshi

నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన అధికారులు

నిజామాబాద్‌ నాగారం: ఇందల్‌వాయి మండలం గన్నారం పరిధిలో ఉన్న దాబాలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్సు సీఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. టాస్క్‌ఫోర్సు సిబ్బంది దాడుల్లో మంగళవారం గన్నారం పరిధిలో ఉన్న దాబా లో దేవితండాకు చెందిన వినోద్‌కుమార్‌ దాబాలో ఎండుగంజాయి ప్యాకెట్‌లను లారీ డ్రైవర్లకు విక్రయిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామన్నారు.

దాబా యజమానులు అశోక్, వినోద్‌కుమార్‌పై కేసు నమోదుచేసి అరెస్టు చేశామన్నారు. 1.6 కేజీల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ రూ.30 వేలు ఉంటుందన్నారు. టాస్క్‌ఫోర్సు ఎస్‌ఐ సింధూ, సిబ్బంది ఫయాజ్, మశ్చేందర్, అహ్మద్, రాజేశ్వర్, రమణ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement