సుప్రీంకోర్టులో సజ్జన్‌ కుమార్‌ పిటిషన్‌

Sajjan Kumar to move SC against judgment - Sakshi

న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవశిక్ష ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత సజ్జన్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో సిక్కుల తరఫు న్యాయవాది హెచ్‌.ఎస్‌.ఫూల్కా మీడియాతో మాట్లాడుతూ.. సిక్కుల ఊచకోత వ్యవహారంలో తాము గతంలోనే సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశామని తెలిపారు. దీంతో సజ్జన్‌ కుమార్‌ పిటిషన్‌పై కోర్టు రిజిస్ట్రీ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top