ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన దుండగులు

rtc bus in fire - Sakshi

వైరా: ఖమ్మంజిల్లా వైరా బస్‌ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ బస్‌ స్టేషన్‌లో నైట్‌ హాల్ట్‌గా ఉన్న మధిర డిపోకు చెందిన బస్సు తిరిగి తెల్లవారుజామున బయల్దేరి వెళ్తుంది. అయితే అర్ధరాత్రివేళ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. బస్సు పాక్షికంగా తగులబడింది. కాగా, బస్సుకు వెనుకవైపు ఎమ్మార్పీఎస్‌ జెండా కట్టి ఉంది. ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను అరెస్టు చేసినందున ఆయన్ను విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు, నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్సుకు నిప్పుపెట్టడంతో ఇది వారి పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top