కువైట్లో తెలుగువారి మృతి
క్రిస్మస్ రోజున ఘోర రోడ్డు ప్రమాదం
కువైట్ సిటీ : కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు మృతి చెందారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒకరు రాయచోటికి చెందినవారు కాగామరొకరు కాకినాడ వాసిగా గుర్తించారు. వీరు కైరవాన్ ప్రాంతంలో ఇంటిపనులు చేసి జీవనం సాగిస్తున్నట్టుగా తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.