వీడిన మిస్టరీ.. డబ్బు కోసమే హత్య | Police Arrested One Accused In Nanded Sadhus Murder Case | Sakshi
Sakshi News home page

వీడిన మిస్టరీ.. డబ్బు కోసమే హత్య

May 24 2020 5:24 PM | Updated on May 24 2020 5:27 PM

Police Arrested One Accused In Nanded Sadhus Murder Case - Sakshi

సాక్షి, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని నాంధేడ్‌లో హత్య గురైన ఇద్దరు సాధువుల మర్డర్‌ మిస్టరీ వీడింది. ఈ కేసుతో సంబంధమున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిర్మల్‌ జిల్లా ఎల్వీలో  నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంలో పోలీసుల విచారణలో పలు అంశాలు వెలుగుచూశాయి. డబ్బు కోసమే సాధువులను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి వాంగ్మూలం తీసుకుని కస్టడికి తరలించారు. కాగా శనివారం రాత్రి విగతజీవిగా పడి ఉన్న ఇద్దరు సాధువులు బాలబ్రహ్మచారి శివాచార్య, ఆయన శిష్యుడు భగవాన్‌ షిండే మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 24 గంటల్లోనే హత్య కేసును పోలీసులు ఛేదించారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement