ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి | One Person Died In Accident Because Car Rolled In Raghunadhapalem Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో కారు బోల్తా; ఒకరి మృతి

Nov 5 2019 10:03 AM | Updated on Nov 5 2019 10:18 AM

One Person Died In Accident Because Car Rolled In Raghunadhapalem Khammam - Sakshi

సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ వద్ద మంగళవారం కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. కాగా కారులో నిషేదిత గంజాయిని తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ బానోత్‌ సురేందర్‌ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని నాలుగు క్వింటాళ్ల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమ్మిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement