ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌

In Mumbai Congress Worker Stabbed To Death Over Facebook Post - Sakshi

ముంబై : ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ప్రాణం తీసింది. వివరాలు.. ముంబైకి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త మనోజ్‌ దుబే(45) అనే వ్య​క్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. దుబే తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన ఓ పొలిటికల్‌ పోస్ట్‌ ఈ దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తుల గురించి పూర్తి సమాచారం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబే మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్‌ కార్యకర్తలు సంతాపం తెలిపారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ ఆరోపించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top