మోడల్‌ హత్య; శవంతో పాటు ప్రయాణం

Model Murdered in Mumbai - Sakshi

యువకుడి దాష్టీకం

సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. అప్‌కమింగ్‌ మోడల్‌ మాన్సీ దీక్షిత్‌ అంధేరీలో దారుణ హత్యకు గురైంది. వివరాలు... హైదరాబాద్‌కు చెందిన ముజామిల్‌ అనే యువకుడు కొన్ని రోజుల క్రితం బంధువులతో కలిసి ముంబైకి వచ్చాడు. కాగా అతడి బంధువుల పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మాన్సీ ముజామిల్‌ను కలిసేందుకు వాళ్ల ఫ్లాట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ముజామిల్‌ మాన్సీని హతమార్చాడు. అనంతరం.. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని సూట్‌కేసులో కుక్కి టాక్సీని పిలిచాడు. మలాద్‌ ఏరియాలో ఆమె శవాన్ని పడేసి మళ్లీ ఇంటికి చేరుకున్నాడు.

కాగా ముజామిల్‌ ప్రవర్తనపై అనుమానం కలగడంతో టాక్సీ డ్రైవర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మలద్‌ ప్రాంతం నుంచి మాన్సీ శవాన్ని స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top