ఘోరం.. గ్యాంగ్‌ రేప్‌ చేసి మరీ..

Men Rape And Filmed Women In Rajasthan - Sakshi

జైపూర్‌ : రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ మహిళపై ఆరుగురు యువకులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌ లోడ్‌ చేశారు. నెల రోజుల తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

బరాన్‌ జిల్లా కోటా ప్రాంతానికి చెందిన  ఓ మహిళా(40) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. గత నెలలో పొరుగూరిలో ఉన్న బంధువులను చూసేందుకు తెలిసిన వ్యక్తి చేతన్‌ మీనా(21) సాయం తీసుకుంది. ఆ మహిళను తన బైక్‌పై తీసుకెళ్లిన మీనా సమాస్‌పుర శివార్లో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికే తన ఐదుగురు స్నేహితులను అక్కడికి రప్పించాడు.

ఈ క్రమంలో ఆ ఆరుగురు దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను ఇంటి వద్ద వదిలి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతామని బెదిరించారు. దాంతో ఆమె విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. కానీ, తాజాగా ఆ వీడియోను దుండగులు సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. విషయం తెలుసుకున్న బాధితురాలు స్థానిక మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top