వివాహిత అదృశ్యం

Married woman Disappear in visakhapatnam - Sakshi

తగరపువలస(భీమిలి): జీవీఎంసీ భీమిలి జోన్‌ 4వ వార్డు కు చెందిన జి.భారతి(25) అనే వివాహిత అదృశ్యమైంది. గత నెల 28న మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదనిఆమె తల్లి ధనలక్ష్మి శుక్రవారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాణీ విద్యానికేతన్‌ సమీపంలో తల్లితో నివసిస్తున్న భారతికి గతంలో రాజ్‌కుమార్‌ అనే వ్యక్తితో వివాహమైంది. మూడేళ్ల క్రితం ఆయనతో విడాకులు తీసుకున్నట్టు తెలిసింది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top