వివాహిత బలవన్మరణం | Married woman committed suicide in athmakur | Sakshi
Sakshi News home page

వివాహిత బలవన్మరణం

Mar 2 2018 10:31 AM | Updated on Nov 6 2018 7:53 PM

Married woman committed suicide in athmakur - Sakshi

మృతురాలు సంధ్య

ఆత్మకూర్‌ (కొత్తకోట): కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం మండలంలోని ఆరేపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్వ రమేష్‌కు కర్నూలుకు చెందిన సంధ్య(22)తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఈ మధ్య కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement