ఎన్నికల వేళ మావోల కుట్ర భగ్నం | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ మావోల కుట్ర భగ్నం

Published Fri, Dec 7 2018 5:36 PM

Maoist Conspiracy Is Ruined In Bhadradri Kothagudem District During Election Time - Sakshi

చర్ల: ఎన్నికల్లో విధ్వంసం సృష్టించాలన్న మావోయిస్టుల కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు యాక్షన్‌ టీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను టార్గెట్‌ చేసి ల్యాండ్‌మైన్లను భారీగా మావోలు అమర్చారు. విశ్వసనీయ సమాచారంతో యాక్షన్‌ టీంను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement