రెచ్చిపోయిన రౌడీషీటర్లు..వ్యక్తి హత్య

Man Died Who Attacked By Rowdy Sheeters In Benz Circle - Sakshi

సాక్షి, విజయవాడ : బెంజిసర్కిల్‌లో గల ఓ బార్‌లో రౌడీషీటర్లు మద్యం మత్తులో చెలరేగిపోయారు. మద్యం సీసాలతో ఓ వ్యక్తిపై దాడి చేసి అతడి ప్రాణాలు బలిగొన్నారు. వివరాలు.. కృష్ణలంకకు చెందిన ఇమ్రాన్‌, సద్దాం అనే ఇద్దరు రౌడీషీటర్లు మద్యం సేవించేందుకు బెంజ్‌ సర్కిల్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఓ బార్‌లో మద్యం సేవిస్తుండగా కుర్చీ కోసం పక్క టేబుల్‌లో కూర్చున్న వ్యక్తులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అనిల్‌ అనే వ్యక్తిపై మద్యం సీసాలతో దాడి చేశారు. అనంతరం అతడిపై పిడిగుద్దులు కురిపించారు. దీంతో తీవ్రగాయాలపాలైన అనిల్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనలో ఇమ్రాన్‌, సద్దాంలతో పాటు మరో నలుగురు నిందితులను కృష్ణలంక పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top