నందిగామలో దారుణం : హత్య చేసి పూడ్చి పెట్టారు

Man Brutally Assassinated At Nandigama In Krishna District - Sakshi

సాక్షి, కృష్ణా : జిల్లాలోని నందిగామాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని హత్య చేసి పూడ్చి పెట్టారు గుర్తు తెలియని దుండగులు. మృతుడిని నవీన్‌ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఓ యూట్యూబ్‌ చానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్‌.. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం నందిగామలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. వివరాల ఆధారంగా ఆ వ్యక్తిని నవీన్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొంతమంది అనుమానితులను అదుపులోకి విచారిస్తున్నారు. మృతదేహన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top