బయటకొచ్చిన కత్తి మహేష్.. రాముడిపై మళ్లీ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ బయటికొచ్చారు. గత రాత్రి(సోమవారం) బంజారాహిల్స్ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అర్థరాత్రి విచారణ కోసం స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు.. ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసుకు సంబంధించిన వివరాలు చెప్పటంతో.. వివరణ కోరుతూ ఇప్పుడు నోటీస్ ఇచ్చారని, దర్యాప్తుకు సహకరించమని కోరారని కత్తి మహేష్ తెలిపారు. ఇకపైన మిగతా విషయాలు చూడాలి అంటూ ఫేస్బుక్లో ఆయన ఓ పోస్ట్ చేశారు.
అయితే అంతటితో ఆగకుండా మరో పోస్టుతో ఆయన దుమారం రేపారు. ‘శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనువదించిన రామాయంలోని యుద్ధకాండలోని కొంత భాగాన్ని’ ఆయన పోస్ట్ చేశారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయలేదని తన వ్యాఖ్యలను మహేష్ సమర్థించుకుంటున్న విషయం తెలిసిందే. (ఇంతకీ కత్తి ఏమన్నాడంటే...)