లూటీ సొమ్మును రాబట్టారు.. | Jharkhand Police Recovers Rs Thirty Five Lack Looted From Bank Staff | Sakshi
Sakshi News home page

లూటీ సొమ్మును రాబట్టారు..

Jun 26 2018 8:15 PM | Updated on Aug 21 2018 6:08 PM

Jharkhand Police Recovers Rs Thirty Five Lack Looted From Bank Staff - Sakshi

సాక్షి, రాంచీ : పలము జిల్లాలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో సిబ్బందిని బెదిరించి చోరీకి పాల్పడిన దుండగుల నుంచి జార్ఖండ్‌ పోలీసులు చోరీ సొత్తును రాబట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలోని ఓ ఇంటిపై దాడి చేసిన జార్ఖండ్‌ పోలీసులు బ్యాంకులో లూటీ చేసిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 15న పలము జిల్లాలోని ఓ ఏటీఎంలో డిపాజిట్‌ చేసేందుకు ప్రైవేట్‌ బ్యాంక్‌ సిబ్బంది వెళుతుండగా దుండగులు దాడి చేసి రూ 54 లక్షలు దోచుకెళ్లారు.

జల్పాయిగురి పోలీసుల సహకారంతో ఫతపుకూర్‌ ప్రాంతంలోని ఓ గృహంపై జార్ఖండ్‌ పోలీసులు దాడి చేసి రూ 35 లక్షలను రాబట్టారు. పోలీసులు దాడి చేసే ముందు గృహంలో ఉంటున్న ఇద్దరు వ్యక్తులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement