ముస‌లి త‌ల్లికి కొడుకు, మ‌న‌వడు వేధింపులు | Elderly Woman Tortured By Son And Grandson In Karnataka | Sakshi
Sakshi News home page

కొడుకుతో క‌లిసి త‌ల్లికి చిత్ర‌హింస‌లు

Jul 17 2020 5:56 PM | Updated on Jul 17 2020 5:59 PM

Elderly Woman Tortured By Son And Grandson In Karnataka - Sakshi

బెంగ‌ళూరు: జ‌న్మినిచ్చిన త‌ల్లిని రాచిరంపాన పెడుతూ రాక్ష‌సానందం పొందాడో ప్ర‌బుద్ధుడు. నాన‌మ్మ అని గౌర‌వించ‌కుండా తండ్రిని మించిపోయి చిత్ర‌హింస‌లు పెట్టాడో యువ‌కుడు. వ‌య‌సు మీద ప‌డ్డ ముస‌లి త‌ల్లిని తాగిన మ‌త్తులో ప్ర‌తిరోజు కొడుతూ న‌ర‌కం చూపించారు తండ్రీకొడుకులు. ఈ దారుణం కర్ణాట‌క‌లో చోటు చేసుకుంది. బెళ‌తంగాడీకి చెందిన శ్రీనివాస్ శెట్టి త‌ల్లి ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించేవాడు. (ఆయనే లేకుంటే రక్తం ఏరులై పారేది..)

శ్రీనివాస్‌తో పాటు, అత‌ని కొడుకు ప్ర‌దీప్ శెట్టి కూడా రోజూ తాగొచ్చి ఆమెను కొట్టేవారు. ఈ క్ర‌మంలో ఓ రోజు శ్రీనివాస్‌ త‌ల్లిపై చేయి చేసుకోవ‌డ‌మే కాక ఆమెను‌ నేల‌పై ఈడ్చుకుంటూ వెళ్లి మూల‌కు విసిరేసాడు. ఈ‌ వీడియోను ఆమె రెండో మ‌నుమ‌డు వీడియో తీయ‌గా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ వీడియోలో ముస‌లిత‌నంలో ఉన్న‌ ఆమె నిస్స‌హాయురాలై సాయం కోసం అర్థించ‌టం అంద‌రినీ కలిచివేస్తోంది. వీడియో ఆధారంగా కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితులిద్ద‌రినీ అరెస్ట్ చేశారు. (అల్లుని కుటుంబంపై కత్తులతో దాడి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement