బిందెతో కొట్టి అత్తను చంపిన కోడలు

Daughter In Law Murdered Mother In Law In West Godavari - Sakshi

ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగడంతో ఘటన

సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఇరగవరం మండలం రేలంగిలో చోటుచేసుకుంది. వివరాలు.. కుటుంబ కలహాల కారణంగా అత్తా కోడళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు భౌతికదాడి చేసుకున్నారు. ఈ క్రమంలో అత్త తలపై కోడలు బిందెతో బలంగా కొట్టింది. తీవ్ర గాయాలతో అత్త కూసంపూడి మహాలక్ష్మి మృతిచెందిందని స్థానికులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top