ఢిల్లీలో జరిగిన మాదిరిగా హైదరాబాద్‌లో కూడా.. | Auto Driver Held in Hyderabad For Rumors Spread in Social Media | Sakshi
Sakshi News home page

వదంతులు సృష్టించిన ఆటోడ్రైవర్‌ అరెస్టు

Mar 11 2020 8:37 AM | Updated on Mar 11 2020 8:37 AM

Auto Driver Held in Hyderabad For Rumors Spread in Social Media - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియాలో వాట్సాప్‌ ద్వారా వదంతులు సృష్టించిన నిందితుడిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని అహ్మద్‌నగర్‌కు చెందిన రహ్మత్‌ షరీఫ్‌ వృత్తిరీత్యా ఆటోడ్రైవర్‌. ఇతగాడు ఆదివారం నాలుగు నిమిషాల నిడివితో ఓ ఆడియో క్లిప్‌ రూపొందించాడు. అందులో తానే మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ జరిగిన మాదిరిగా హైదరాబాద్‌లోని కలహాలు జరిగే ఆస్కారం ఉందంటూ మాట్లాడాడు. దీనికి ఆధారాలు అంటూ కొన్ని అసందర్భ వ్యాఖ్యలు జోడించాడు. ఈ ఆడియో వాట్సాప్‌లో వైరల్‌ కావడంతో సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. తీవ్రమైన వ్యాఖ్యలతో ఉన్న ఈ ఆడియోపై సుమోటో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... తన ఆడియో వైరల్‌గా మారిందని, ఫలితంగా తీవ్ర పరిణామాల ఎదుర్కోవాల్సి వస్తుందని షరీఫ్‌ స్నేహితులు అతడిని భయపెట్టారు. దీంతో మంగళవారం అతడే వెళ్లి బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో విషయం చెప్పి లొంగిపోయాడు. ఈ ఆడియోపై అప్పటికే సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదై ఉండటంతో అక్కడి అధికారులు సైబర్‌ కాప్స్‌కు అప్పగించడంతో అరెస్టు అయ్యాడు.  పుకార్లు సృష్టించవద్దని సీపీ అంజనీకుమార్‌ ట్వీట్‌లో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement