ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

Published Sun, Oct 8 2017 7:49 AM

7 killed in road accident in Ulundurpettai - Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడు రోడ్డు మరోసారి నెత్తురొడింది. ఆదివారం ఉదయం విలుపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 

ఉలుందుర్‌పెట్‌ మండలం ఉలుందుర్‌పెట్టై పట్టణ పంచాయితీ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement