విజయవాడలో దారుణం
సాక్షి, విజయవాడ : నగరంలోని కేఎల్ ప్రాథమిక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వికటించడంతో నలుగురు చిన్నారులు పరిస్థితి విషమంగా మారింది. చిన్నారులను నోరీ ఆసుపత్రిలో చేర్చారు. 48 గంటలు గడిస్తే గాని పిల్లల పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.
పిల్లల పరిస్ధితి ఆందోళనకరంగా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరీలో చికిత్స పొందుతున్న చిన్నారుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్లు పరామర్శించారు.