మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
సాక్షి, ముంబయి: హిమాచల్ ప్రదేశ్లో ఘోర దుర్ఘటన మరవకముందే మహారాష్ట్రలోనూ మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఖండాలలోని పూణె-సతరా జాతీయ రహదారిపై ఓ ట్రక్ అదుపు తప్పి బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మరో 15మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా హిమాచల్ ప్రదేశ్ల కంగ్రా జిల్లా నూర్పూర్ ప్రాంతంలో నిన్న (సోమవారం) ఓ స్కూల్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 27 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా 10ఏళ్ల లోపు చిన్నారులే.