వీఎస్టీ లాభం రూ. 49 కోట్లు | Sakshi
Sakshi News home page

వీఎస్టీ లాభం రూ. 49 కోట్లు

Published Thu, Apr 21 2016 1:42 AM

వీఎస్టీ లాభం రూ. 49 కోట్లు - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వీఎస్‌టీ ఇండస్ట్రీస్ రూ. 270 కోట్ల ఆదాయంపై నికర లాభం రూ. 49 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 883 కోట్ల కాగా లాభం రూ. 153 కోట్లు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 836 కోట్లు కాగా లాభం రూ. 152 కోట్లు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 70 డివిడెండు ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది.

Advertisement
Advertisement