వొడాఫోన్‌ ఆ ప్లాన్‌పై 30జీబీ డేటా | Vodafone RED Rs. 399 Plan Now Offers 30GB Data, Unlimited Calls | Sakshi
Sakshi News home page

వొడాఫోన్‌ ఆ ప్లాన్‌పై 30జీబీ డేటా

Feb 6 2018 1:11 PM | Updated on Feb 6 2018 1:11 PM

Vodafone RED Rs. 399 Plan Now Offers 30GB Data, Unlimited Calls - Sakshi

వొడాఫోన్‌

రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు వొడాఫోన్‌ ఇండియా కూడా తన ప్లాన్లను అప్‌గ్రేడ్‌ చేస్తోంది. తన పోస్టు పెయిడ్‌ సబ్‌స్క్రైబర్ల కొత్త రెడ్‌ ప్లాన్‌ను వొడాఫోన్‌ అప్‌డేట్‌ చేసింది. ఈ కొత్త వొడాఫోన్‌ ప్లాన్‌ రూ.399 కింద నెలకు 30జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, నేషనల్‌ రోమింగ్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు కస్టమర్లకు లభించనున్నాయి. వొడాఫోన్‌ ప్లే సర్వీసు ద్వారా రూ.4000 విలువైన మూవీలకు ఉచిత యాక్సస్‌ లభించనుంది. నాలుగు నెలల పాటు 3500 ఈ-మ్యాగజైన్లను చదువుకునేలా మ్యాగ్‌జటర్‌ సబ్‌స్క్రిప్షన్‌ను వొడాఫోన్‌ ఆఫర్‌ చేయనుంది. ఇతర ప్లాన్స్‌ మాదిరిగానే కొత్త రూ.399 వొడాఫోన్‌ రెడ్‌ప్లాన్‌ అపరిమిత కాల్స్‌లో రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే మాట్లాడుకోవాలి. 

తొలుత వొడాఫోన్‌ రెడ్‌ సబ్‌స్క్రైబర్లు రూ.399 ప్లాన్‌ను పొందడానికి తమ మొబైల్‌ హ్యాండ్‌సెట్ల నుంచి 199కి కాల్‌ చేయాల్సి ఉండేది. అయితే అధికారిక వొడాఫోన్‌ సైట్‌ మాత్రం ఈ కొత్త ప్లాన్‌ వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ప్రస్తుత ప్లాన్‌ ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, జార్ఖాండ్‌, జమ్ము అండ్‌ కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ సర్కిళ్లలో అందుబాటులో లేదు. గతేడాది నవంబర్‌లో వొడాఫోన్‌ తన పోస్టు పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు ఈ రూ.399ల రెడ్‌ బేసిక్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. అప్పుడు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, నేషనల్‌ రోమింగ్‌పై ఉచిత ఇన్‌కమింగ్‌, 10జీబీ డేటాను ఆఫర్‌ చేసేంది. ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించలేదు. అనంతరం ఈ ప్లాన్‌ను అప్‌గ్రేడ్‌ చేసి డేటా పరిమితిని 20జీబీకి పెంచింది. ప్రస్తుతం ఈ డేటాను మరో 10జీబీ పెంచి, 30జీబీ చేసింది. జియో​ తన రూ.309 పోస్టు పెయిడ్‌ప్లాన్‌పై 30జీబీ డేటాను, ఎయిర్‌టెల్‌ తన రూ.399 మైఇన్ఫినిటీ పోస్టుపెయిడ్‌ ప్లాన్‌పై 20జీబీ డేటాను ఆఫర్‌ చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement