మార్కెట్ పంచాంగం
ప్రపంచ స్టాక్ మార్కెట్లు గ్రీసు సంక్షోభంతో సతమతమవుతున్న సమయంలో నాటకీయంగా చైనా మార్కెట్ పతనం అల్లకల్లోలం సృష్టించింది. ముగిసిన గురు, శుక్రవారాల్లో చైనా మార్కెట్ కోలుకున్నప్పటికీ, దాదాపు సగం షేర్లలోనే ట్రేడింగ్ జరిగినందున, ఆ రికవరీ కొనసాగుతుందో, లేదో డౌటే. అక్కడ పతనం నేపథ్యంలో సగం షేర్లలో ట్రేడింగ్ రద్దుచేశారు.
మరోవైపు గ్రీసు బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ సమర్పించిన కొత్త ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందన్న అంచనాలతో శుక్రవారం ప్రపంచంలో అన్ని మార్కెట్లూ ర్యాలీ జరిపాయి. కానీ గ్రీసుకు ప్యాకేజీ ఇచ్చే అంశమై యూరప్ దేశాల్లో చీలిక వచ్చినట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రీసు, చైనా అంశాలు రానున్న కొద్దిరోజుల్లో స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేయవచ్చు. ఇక మన సూచీల సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జూలై 10తో ముగిసిన వారం ప్రథమార్ధంలో 28,335 పాయింట్ల గరిష్టస్థాయిని చేరిన తర్వాత ద్వితీయార్ధంలో 27,530 పాయింట్ల కనిష్టస్థాయికి బీఎస్ఈ సెన్సెక్స్ పడిపోయింది. చివరకు దాదాపు 1.53 శాతం నష్టంతో 27,661 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్డౌన్తో మొదలైతే 27,500 స్థాయి వద్ద చిన్నపాటి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన సెన్సెక్స్ ప్రారంభమైతే, వేగంగా జూన్ 29నాటి కనిష్టస్థాయి 27,209 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.
రానున్న కొద్దిరోజుల్లో ఈ స్థాయిని వదులుకుంటే, తర్వాతి వారాల్లో 26,300 పాయింట్ల స్థాయికి పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ వారం గ్యాప్అప్తో మార్కెట్ మొదలైతే 28,030 పాయింట్ల స్థాయి తొలి నిరోధాన్ని కల్పించవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, ముగిస్తే 28,335 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని బలంగా ఛేదిస్తే 28,700 స్థాయికి పెరిగే అవకాశాలుంటాయి. అటుపైన స్థిరపడితే కొద్ది వారాల్లో 29,090 పాయింట్ల స్థాయిని చేరవచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 8,300-నిరోధం 8,460
ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం 8,500 పాయింట్లపైన స్థిరపడి, పాజిటివ్ ముగింపు కనపర్చినా, చైనా మార్కెట్ నాటకీయంగా పతనమయిన ప్రభావంతో ఈ సూచీ కూడా పడిపోయింది. చివరకు అంతక్రితం వారంకంటే 124 పాయింట్ల క్షీణతతో 8,361 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం గ్యాప్డౌన్తో మార్కెట్ మొదలైతే 8,300 పాయింట్ల స్థాయి తొలి మద్దతును అందించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే క్రమేపీ 8,195 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు.
గ్రీసు, చైనా సంక్షోభాలు తలెత్తి తీవ్రస్థాయిలో ప్రపంచ మార్కెట్లను చుట్టుముడితే 7,940 స్థాయి వద్దకు సైతం పతనమయ్యే ప్రమాదం వుంటుంది. ఈ సోమవారం గ్యాప్అప్తో మొదలైతే 8,460 పాయింట్ల స్థాయి వద్ద తొలి అవరోధం ఏర్పడవచ్చు. ఈ స్థాయిని అధిగమించి, స్థిరపడితే క్రమేపీ 8,550 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే కొద్దివారాల్లో 8,845 పాయింట్ల స్థాయిని చేరే చాన్స్ వుంటుంది.
మద్దతు 27,500-నిరోధం 28,030
Published Mon, Jul 13 2015 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement