పెరోల్ పై కొనసాగనున్న రాయ్! | Subrata Roy's parole extended till November 28 | Sakshi
Sakshi News home page

పెరోల్ పై కొనసాగనున్న రాయ్!

Oct 22 2016 12:24 AM | Updated on Sep 4 2017 5:54 PM

పెరోల్ పై కొనసాగనున్న రాయ్!

పెరోల్ పై కొనసాగనున్న రాయ్!

సహారా చీఫ్ సుబ్రతారాయ్, సంస్థకు సంబంధించి మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే అక్టోబర్ 24 తరువాతా పెరోల్‌పై కొనసాగడానికి మార్గం సుగమం అయ్యింది.

న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, సంస్థకు సంబంధించి మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే అక్టోబర్ 24 తరువాతా పెరోల్‌పై కొనసాగడానికి మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28 ఆదేశాలకు అనుగుణంగా గడువుకన్నా రెండు రోజుల ముందుగానే శుక్రవారం సెబీకి సహారా రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ ఏర్పాటు కొనసాగడానికి నవంబర్ 28వ తేదీలోపు సహారా మరో రూ.200 కోట్లు చెల్లించాలని సుప్రీం బెంచ్ ఆదేశించింది. కాగా సెబీ సహారా అకౌంట్లో డిసెంబర్ 2018 నాటికి రూ.12,000 కోట్లు జమచేయడానికి సంబంధించి రోడ్‌మ్యాప్‌తో తాము సిద్ధమని రాయ్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు శుక్రవారం విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement