-
రూ. 62,600 కోట్లు చెల్లించకుంటే జైలుకే!
ముంబై, సాక్షి: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్తోపాటు, అతనికి చెందిన మరో రెండు కంపెనీలను 8.4 బిలియన్ డాలర్లు(రూ. 62,600 కోట్లు) చెల్లించవలసిందిగా ఆదేశించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. చెల్లించలేని పక్షంలో అతనికిచ్చిన బెయిల్ను రద్దు చేయవలసిందిగా కోరింది. సహారా గ్రూప్.. 2012, 2015లలో కోర్టు జారీ చేసిన ఆదేశాలను పాటించలేదని ఈ సందర్భంగా సెబీ తాజా ఫిర్యాదులో పేర్కొంది. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తం సొమ్మును 15 శాతం వార్షిక వడ్డీతో చెల్లించవలసిందిగా గతంలో కోర్టు ఆదేశాలు జారీచేసినట్లు తెలియజేసింది. 2014లో అరెస్టయిన రాయ్ 2016 నుంచీ బెయిల్పై ఉన్నారు. 8 ఏళ్లుగా.. గత 8 ఏళ్లుగా నిబంధనలు ఉల్లంఘింస్తున్న రాయ్ ఇకనైనా పూర్తిసొమ్మును చెల్లించకుంటే కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీం కోర్టును తాజా ఫిర్యాదులో సెబీ కోరింది. గతంలో సహారా ఇండియా పరివార్ గ్రూప్ అసలు మొత్తంలో కొంతమేర మాత్రమే డిపాజిట్ చేసిందని, మిగిలిన సొమ్ముతోపాటు వడ్డీలు కలిపి భారీగా రూ. 62,600 కోట్లకు చేరాయని సుప్రీంకు సెబీ వివరించింది. 8 ఏళ్ల క్రితం ఈ మొత్తం రూ. 25,700 కోట్లు మాత్రమేనని తెలియజేసింది. కాగా.. సహారా ఇప్పటికే సెబీకి రూ. 22,000 కోట్లు డిపాజిట్ చేసినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే పూర్తి సొమ్ముపై వడ్డీని విధించడం ద్వారా సెబీ భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించారు. సహారా గ్రూప్ సెక్యూరిటీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి 3.5 బిలియన్ డాలర్లను చట్టవిరుద్ధంగా సమీకరించినట్లు 2012లో సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయితే సహారా గ్రూప్ ఈ నిధులను తిరిగి చెల్లించకపోవడంతో గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ను జైలుకి తరలించారు. -
సెప్టెంబర్ 7లోగా రూ.1,500 కోట్లు కట్టండి
సహారా చీఫ్ సుబ్రతా రాయ్కు సుప్రీంకోర్టు ఆదేశాలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు నిధులు వాపసు చేయాల్సిన కేసుకు సంబంధించి సెప్టెంబర్ 7లోగా సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో రూ. 1,500 కోట్లు జమచేయాలంటూ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయనకు మంజూరు చేసిన పెరోల్ గడువును అక్టోబర్ 10 దాకా పొడిగించింది. అటు ఆంబీ వ్యాలీ ప్రాపర్టీ విక్రయానికి సేల్ నోటీసును ప్రచురించడానికి బాంబే హైకోర్టుకు చెందిన అధికారిక లిక్విడేటరుకు అనుమతులిచ్చింది. కేసుపై తదుపరి విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. గ్రూప్ కంపెనీలైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్.. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన రూ. 24,000 కోట్లు తిరిగి చెల్లించాల్సిన కేసులో సుబ్రతా రాయ్ దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది మే 6న ఆయనకు పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం నిర్దిష్ట తేదీల్లోగా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేస్తూ ఉండాలని, లేని పక్షంలో పెరోల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సుబ్రతారాయ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జూలై 15 నాటికి రూ. 552.21 కోట్లు జమ చేయాల్సి ఉండగా రూ. 247 కోట్లే జమచేయగలిగామని, మిగతా మొత్తం రూ. 305.21 కోట్లను ఆగస్టు 12 నాటికి డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి కట్టాల్సిన రూ. 1,500 కోట్లలో దీన్ని కూడా లెక్కవేసి కట్టాలంటూ సుప్రీం కోర్టు సూచించింది. -
‘రూ.600కోట్లు జమ చేయ్.. లేదంటే ఇక జైలుకే..’
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్కు సుప్రీంకోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఫిబ్రవరి 6లోగా సెబీ-సహారాలో రూ.600 కోట్లు జమచేయాలని లేదంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ రంజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చదవండి..(పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!) ఇప్పటికే ఆయనకు చాలా అవకాశం ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. మరింత గడువు కావాలంటూ మరోసారి సహారా గ్రూపు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఇప్పటి వరకు సహారా గ్రూపు పెట్టుబడిదారులకు దాదాపు రూ.18,000 కోట్లు తిరిగి చెల్లించింది. అనంతరం మరో వెయ్యి కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి అనంతరం ఆ మొత్తాన్ని రూ.600 కోట్లకు తగ్గించి ఫిబ్రవరి 6నాటికి చెల్లించాలని ఆదేశించింది. -
పెరోల్ పొడిగిస్తాం కానీ..రూ.600 కోట్లు చెల్లించు!
సహారా చీఫ్ సుబ్రతా రాయ్ పెరోల్ గడువును సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. 2017 ఫిబ్రవరి 6వరకు పెరోల్ గడువు పొడిగిస్తున్నట్టు సుప్రీం సోమవారం పేర్కొంది. అయితే జైలు బయట ఉండటానికి ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు రూ.600 కోట్లను డిపాజిట్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం సహారా చీఫ్ను ఆదేశించింది. ఒకవేళ డబ్బును డిపాజిట్ చేయని పక్షంలో సరెండర్ అవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అక్టోబర్ 25న కూడా సుప్రీంకోర్టు సుబ్రతా రాయ్ పెరోల్ను నవంబర్ 28వరకు పొడిగించింది. ఈ పొడిగింపుకు సహారా గ్రూప్ రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. మరో రూ.200 కోట్లను నవంబర్ ఆఖరికల్లా చెల్లించనున్నట్టు సహారా పేర్కొంది. కాగ, సుబ్రతారాయ్ తల్లి గత మే నెలలో మరణించడంతో కోర్టు మానవతా దృక్పథంతో ఆయనకు పెరోల్ మంజూరు చేసింది. ఆ తర్వాత డిపాజిట్ దారులకు డబ్బు వెనక్కి ఇచ్చేందు కోసం నాటి నుంచి ఆయన పెరోల్ను కోర్టు పొడిగిస్తూ వస్తోంది. నేటితో ముగుస్తున్న ఆయన పెరోల్ గడువును అపెక్స్ కోర్టు మరోసారి పొడిగించింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి రెండు సహారా గ్రూప్ సంస్థలు రూ.25,000 కోట్లు వసూలు చేయడం.. వడ్డీతో సహా మొత్తం రూ.35,000 కోట్లు దాటి వాటిని తిరిగి చెల్లించడంలో ఆ సంస్థలు వైఫల్య చెందాయి. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ సంస్థల చీఫ్ సుబ్రతారాయ్ 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. అనంతరం ఆయన పెరోల్పై బయటికి వచ్చారు. ఆయన బెయిల్కు రూ.10,000 కోట్లు(సగం నగదు రూపంలో, సగం బ్యాంకు గ్యారెంటీ రూపంలో) చెల్లించాలని మార్చి 26న సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిలో సగం మొత్తం సహారా నగదు రూపంలో సహారా చెల్లించింది. కానీ బ్యాంకు గ్యారెంటీ తరుఫును ఇవ్వాల్సిన రూ.5000 కోట్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. -
పెరోల్ పై కొనసాగనున్న రాయ్!
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, సంస్థకు సంబంధించి మరో ఇరువురు డెరైక్టర్లు- అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబే అక్టోబర్ 24 తరువాతా పెరోల్పై కొనసాగడానికి మార్గం సుగమం అయ్యింది. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 28 ఆదేశాలకు అనుగుణంగా గడువుకన్నా రెండు రోజుల ముందుగానే శుక్రవారం సెబీకి సహారా రూ.200 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ ఏర్పాటు కొనసాగడానికి నవంబర్ 28వ తేదీలోపు సహారా మరో రూ.200 కోట్లు చెల్లించాలని సుప్రీం బెంచ్ ఆదేశించింది. కాగా సెబీ సహారా అకౌంట్లో డిసెంబర్ 2018 నాటికి రూ.12,000 కోట్లు జమచేయడానికి సంబంధించి రోడ్మ్యాప్తో తాము సిద్ధమని రాయ్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు శుక్రవారం విన్నవించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement