సహారా చీఫ్ సుబ్రతా రాయ్కు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు నిధులు వాపసు చేయాల్సిన కేసుకు సంబంధించి సెప్టెంబర్ 7లోగా సెబీ–సహారా రిఫండ్ ఖాతాలో రూ. 1,500 కోట్లు జమచేయాలంటూ సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆయనకు మంజూరు చేసిన పెరోల్ గడువును అక్టోబర్ 10 దాకా పొడిగించింది. అటు ఆంబీ వ్యాలీ ప్రాపర్టీ విక్రయానికి సేల్ నోటీసును ప్రచురించడానికి బాంబే హైకోర్టుకు చెందిన అధికారిక లిక్విడేటరుకు అనుమతులిచ్చింది. కేసుపై తదుపరి విచారణను సుప్రీం కోర్టు సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది. గ్రూప్ కంపెనీలైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్.. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన రూ. 24,000 కోట్లు తిరిగి చెల్లించాల్సిన కేసులో సుబ్రతా రాయ్ దాదాపు రెండేళ్ల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
గతేడాది మే 6న ఆయనకు పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం నిర్దిష్ట తేదీల్లోగా నిర్దిష్ట మొత్తాన్ని జమ చేస్తూ ఉండాలని, లేని పక్షంలో పెరోల్ రద్దవుతుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా సుబ్రతారాయ్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. జూలై 15 నాటికి రూ. 552.21 కోట్లు జమ చేయాల్సి ఉండగా రూ. 247 కోట్లే జమచేయగలిగామని, మిగతా మొత్తం రూ. 305.21 కోట్లను ఆగస్టు 12 నాటికి డిపాజిట్ చేస్తామని పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 7 నాటికి కట్టాల్సిన రూ. 1,500 కోట్లలో దీన్ని కూడా లెక్కవేసి కట్టాలంటూ సుప్రీం కోర్టు సూచించింది.
సెప్టెంబర్ 7లోగా రూ.1,500 కోట్లు కట్టండి
Published Wed, Jul 26 2017 1:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement