బ్యాంకు వినియోగదారులకు మరో గుడ్‌ న్యూస్‌ 

RBI to constitute panel to review ATM interchange fee structure - Sakshi

ఏటీఏం చార్జీలపై తీపి కబురు

తగ్గనున్న ఏటీఎం చార్జీలు : త్వరలోనే  కమిటీ

ఇప్పటికే  ఆన్‌లైన్‌ నగదు బదిలీలపై ఊరట

సాక్షి, న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు అడుగులు వేస్తోంది. ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఛార్జీలు, ఫీజు తగ్గించే అంశంపై  కసరత్తు చేస్తోంది. ఏటీఎం ఇంటర్‌ చార్జీలు, ఫీజు విధానాన్ని సమీక్షించేందుకు త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు గురువారం (మే 6) ప్రకటన చేసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు వెల్లడి సందర్బంగా ఆర్‌బీఐ ఈ సంకేతాలిచ్చింది. నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ల ద్వారా చేపట్టే ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌లపై చార్జీలను తొలగించడంతో ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్‌బీఐ ఏటీఎం చార్జీల విషయంలో కూడా బ్యాంకు ఖాతాదారులకు భారీ  ఊరట నివ్వబోవడం విశేషం. 

ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించిన ఆర్‌బీఐ ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని తెలిపింది. ఇందులో స్టేక్ హోల్డర్స్‌కు చోటు కల్పిస్తామన్నారు.  ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని  ఆర్‌బీఐ అధికారులు తెలిపారు.  తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత, రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  ఆ కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో విధి విధానాలను వెలురిస్తామని పేర్కొంది.  కాగా పాలసీ రివ్యూలో భాగంగా  రెపో రేటు పావు శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6 శాతం రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్‌ రెపో రేటు, బ్యాంక్‌ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. దీంతో  2010 సెప్టెంబర్‌ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు దిగి వచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top