గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఐబీ రియల్‌ఎస్టేట్‌ షేర్లు హై జంప్‌

nifty index 1 percent up - Sakshi

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌లోనూ నిర్మాణ రంగానికి పరిమితులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో భవన నిర్మాణ రంగ పనులు పుంజుకున్నాయి. దీంతో రియల్టీ షేర్లు జోరుగా ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యహ్నాం 12:40 గంటల ప్రాంతంలో నిఫ్టీ రియల్టీ 1.7 శాతం లాభంతో రూ.168.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఉదయం సెషన్‌లో నిఫ్టీ రియల్టీ రూ.166.40 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.168.90 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక ఈ ఇండెక్స్‌లో భాగమైన గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 6శాతం లాభపడి రూ.638.65 వద్ద, ఐబీ రియల్‌ఎస్టేట్‌ 5 శాతం లాభపడి రూ.45 వద్ద, ప్రెస్టేజ్‌ 4.3 శాతం లాభపడి రూ.142.90 వద్ద , ఒబేరాయ్‌ రియల్టీ 2.5 శాతం లాభపడి రూ.309.70 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.సోబా,మహీం‍ద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ స్వల్ప లాభాలతో ట్రేడ్‌ అవుతుండగా, బ్రిగేడ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫోనిక్స్‌ లిమిటెడ్‌, సన్‌టెక్‌లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top