ఆ మొబైళ్లకు పుష్‌ నోటిఫికేషన్స్‌ బంద్‌

Microsoft ends push notifications for Windows 7, 8 Phones  - Sakshi

శాన్‌ఫ్రాన్సిస్‌కో: విండోస్‌ ఫోన్‌ 7.5, విండోస్‌ ఫోన్‌ 8.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే మొబైళ్లకు పుష్‌ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ మంగళవారం తెలిపింది. ఈ మేరకు తన బ్లాగ్‌లో పేర్కొంది. ఒకసారి మద్ధతు నిలిపివేస్తే ఈ వర్షన్లతో నడుస్తున్న మొబైళ్లకు కంపెనీ నుంచి ఎలాంటి పుష్‌ నోటిఫికేషన్లు రావు, ‘ఫైండ్‌ మై ఫోన్‌’ ఫీచర్‌ కూడా పనిచేయదు. విండోస్‌ 8.1, విండోస్‌ 10 మొబైళ్లకు మాత్రం పుష్‌ నోటిఫికేషన్లు అందుతూనే ఉంటాయన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top