లెనోవో నుంచి నూతన థింక్‌ప్యాడ్‌లు | Lenovo Launches ThinkPad Laptops In India | Sakshi
Sakshi News home page

లెనోవో నుంచి నూతన థింక్‌ప్యాడ్‌లు

Sep 18 2019 10:09 AM | Updated on Sep 18 2019 10:09 AM

Lenovo Launches ThinkPad Laptops In India - Sakshi

న్యూఢిల్లీ: లెనోవో నూతన తరం థింక్‌ప్యాడ్, థింక్‌ సెంటర్‌పీసీలను మంగళవారం విడుదల చేసింది. వాణిజ్య ఐవోటీ, సెక్యూరిటీ సొల్యూషన్లలోకి అడుగుపెడుతున్నట్టు ప్రకటించింది. థింక్‌ప్యాడ్‌ టీ490, థింక్‌ప్యాడ్‌ ఎక్స్‌390, థింక్‌సెంటర్‌ నానో, థింక్‌సెంటర్‌ నానో ఐవోటీ ఆవిష్కరించిన వాటిల్లో ఉన్నాయి. సులభమై, భద్రతతో కూడిన, వేగవంతమైన, అధిక పనితీరు చూపించే పరికరాలను నేడు ఉద్యోగులు కోరుకుంటున్నారని, థింక్‌ప్యాడ్‌ ఈ అవసరాలను తీరుస్తుందని ఈ ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా లెనోవో ఇండియా ఎండీ, సీఈవో రాహుల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. కళ్లను సురక్షితంగా ఉంచే టెక్నాలజీతో వీటిని రూపొందించినట్టు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement