రూ.86.5 కోట్లకు గీతాంజలి జెమ్స్‌ మోసం చేసింది | Karnataka Bank falls prey to Gitanjali Gems web | Sakshi
Sakshi News home page

రూ.86.5 కోట్లకు గీతాంజలి జెమ్స్‌ మోసం చేసింది

Mar 30 2018 1:26 AM | Updated on Mar 30 2018 1:26 AM

Karnataka Bank falls prey to Gitanjali Gems web - Sakshi

బెంగళూరు: గీతాంజలి జెమ్స్‌ సంస్థకు మూలధన అవసరాల కోసం నిధులు సర్దుబాటు చేయగా 86.5 కోట్ల మేర మోసానికి పాల్పడిందంటూ కర్ణాటక బ్యాంకు ఆర్‌బీఐకి రిపోర్ట్‌ చేసింది. మెహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌కు మూలధన అవసరాలను కొనసాగించగా ఆ సంస్థ మోసం చేసినట్టు ఆర్‌బీఐకి తెలియజేశామని బీఎస్‌ఈకి సమాచారం అందించింది.

ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు నిధులను కేటాయిస్తామని పేర్కొంది. అయితే, గీతాంజలి జెమ్స్‌కు ఎల్‌వోయూల పరంగా బ్యాంకుకు ఎటువంటి ఎక్స్‌పోజర్‌ లేదని స్పష్టం చేసింది. నీరవ్‌ మోదీ, మెహుల్‌చోక్సీలు పీఎన్‌బీ నుంచి ఎల్‌వోయూలు తీసుకుని రూ.13,540 కోట్ల మేర మోసగించగా, దానిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement