కుంభమేళాలో  జియో సేవలు  | Jio launches services for Kumbh mela visitors | Sakshi
Sakshi News home page

కుంభమేళాలో  జియో సేవలు 

Jan 8 2019 1:12 AM | Updated on Jan 8 2019 1:12 AM

 Jio launches services for Kumbh mela visitors - Sakshi

న్యూఢిల్లీ: అలహాబాద్‌లో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు సంబంధించి ఓ సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదలచేసినట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మార్చి 4వరకు కొనసాగే ఈ ప్రపంచ అతిపెద్ద ఉత్సవంలో పాల్గొనేవారు తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్‌’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తోంది.

జనం మధ్యలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుకోవడం కుంభమేళాలో క్లిష్టతరం కాగా, ఈ యాప్‌ను ఉపయోగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని రిలయన్స్‌ జియో వివరించింది. తప్పిపోయే కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్‌ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement