కుంభమేళాలో  జియో సేవలు 

 Jio launches services for Kumbh mela visitors - Sakshi

ఫ్యామిలీ లొకేటర్‌ యాప్‌ విడుదల 

న్యూఢిల్లీ: అలహాబాద్‌లో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు సంబంధించి ఓ సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను విడుదలచేసినట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. మార్చి 4వరకు కొనసాగే ఈ ప్రపంచ అతిపెద్ద ఉత్సవంలో పాల్గొనేవారు తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్‌’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తోంది.

జనం మధ్యలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుకోవడం కుంభమేళాలో క్లిష్టతరం కాగా, ఈ యాప్‌ను ఉపయోగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని రిలయన్స్‌ జియో వివరించింది. తప్పిపోయే కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్‌ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top