37 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు | Indirect tax collections grew by 37 per cent | Sakshi
Sakshi News home page

37 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు

Aug 12 2015 1:52 AM | Updated on Sep 3 2017 7:14 AM

దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి...

న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగి రూ.2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసిక పరోక్ష పన్ను వసూళ్లు రూ.1.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో రూ.40,802 కోట్లుగా ఉన్న పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది అదే సమయంలో రూ.56,739 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్-జూలై త్రైమాసికంలో ఎక్సైజ్ వసూళ్లు ఏకంగా 75 శాతం పెరిగి రూ.83,454 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే సేవా పన్ను వసూళ్లు 20 శాతం వృద్ధితో రూ.60,925 కోట్లుగా, కస్టమ్స్ సుంకం వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.66,076 కోట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement