ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం | Goldman Sachs Singapore buys 41 lakh shares IndusInd Bank  | Sakshi
Sakshi News home page

ఇండస్ఇండ్ బ్యాంకు రూ.30 కోట్ల విరాళం

Apr 16 2020 2:45 PM | Updated on Apr 16 2020 2:49 PM

Goldman Sachs Singapore buys 41 lakh shares IndusInd Bank  - Sakshi

ఫైల్ ఫోటో

సాక్షి, ముంబై: అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సింగపూర్‌ అనుబంధ సంస్థ పీటీఈ-ఒడిఐ(ఆఫ్‌షోర్‌ డెరివేటివ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌) ప్రయివేటు రంగ  దిగ్గజబ్యాంకు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 0.65 శాతం వాటా కొనుగోలు చేసింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా ఒక్కో షేరు సగటున రూ.430 చొప్పున మొత్తం 4.1 మిలియన్‌ (41 లక్షల) షేర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ విలువ 176 కోట్ల రూపాయలు. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో  ఇవాళ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ జోరుమీదుంది. గురువారం  ప్రారంభలో షేర్ ధర 4శాతానికి పైగా లాభపడింది. గత 3 రోజుల్లో షేర్‌ 8.47 శాతం పెరగడం విశేషం. 

ఓపెన్‌ మార్కెట్లో గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అనుబంధ సంస్థ వాటా కొనుగోలుతో ఇవాళ ఇంట్రాడేలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 4శాతం పైగా లాభపడింది. గత నెల 20న ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయి రూ.235.55కుపడిపోయిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఆ తర్వాత కోలుకుంది. కనిష్ట స్థాయి వద్ద లభించిన కొనుగోళ్ళ మద్దతుతో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 87శాతం లాభపడింది. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో అనేక రాష్ట్రాలలో, జాతీయ స్థాయిలో ప్రభుత్వం , దాని ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్నట్లు ఇండస్ఇండ్ బ్యాంక్  ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం  రూ .30 కోట్ల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. కరోనా వైరస్  విస్తరణ, తదితర పరిణామాలను, అవసరాలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement