మోడీ కిక్కుతో లక్ష కోట్లకు పైగా...
మార్కెట్ లోకి 1,02,171 కోట్ల నిధులను ఎఫ్ఐఐలు పెట్టుబడిగా పెట్టారని సెబీ వెల్లడించింది.
న్యూఢిలీ: ఏ ముహూర్తాన నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించారో ఏమో.. అప్పటి నుంచి భారత స్టాక్ మార్కెట్ లోకి నిధుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ నుంచి స్టాక్ మార్కెట్ లోకి లక్ష కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థాగత మదుపుదారులు(ఎఫ్ఐఐ) మళ్లించారు.
ఇప్పటి వరకు మార్కెట్ లోకి 1,02,171 కోట్ల నిధులను ఎఫ్ఐఐలు పెట్టుబడిగా పెట్టారని సెబీ వెల్లడించింది.
సెప్టెంబర్ 13 తేదిన బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోడీని ప్రకటించింది. మోడీ నేతృత్వంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుందని.. సంస్కరణలు పకడ్బందీగా అమలు చేస్తారనే అంశాలతో పెటుబడి దారులు సానుకూలంగా స్పందించారు.