సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు

సెప్టెంబర్ 4 నుంచి బడ్జెట్ సంప్రదింపులు


న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 4 నుంచి 2016-17 బడ్జెట్‌పై వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపనుంది. తొలిగా వాణిజ్య, టైక్స్‌టైల్, విదేశీ వ్యవహారాల శాఖలతో ప్రారంభం కానున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ సంప్రదింపులు సెప్టెంబర్ 28న ముగుస్తాయి. ఈ సంప్రదింపుల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధానంగా 2016-17 బడ్జెట్ వ్యయ ప్రతిపాదనలపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది. సంప్రదింపుల్లో భాగంగా పలు ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలు వ్యయ ప్రతిపాదనలు తయారు చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందిస్తాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top