వడ్డీరేటు పెంచేసిన మరో ప్రభుత్వ బ్యాంకు | BoB raises lending rate by 5 basis points | Sakshi
Sakshi News home page

వడ్డీరేటు పెంచేసిన మరో ప్రభుత్వ బ్యాంకు

Jun 5 2018 6:42 PM | Updated on Jun 5 2018 6:48 PM

BoB raises lending rate by 5 basis points     - Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వ రంగ  బ్యాంకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లెండింగ్‌ వడ్డీరేట్లను పెంచేసింది.  ఒక సంవత్సరం బెంచ్‌మార్క్ రుణాలపై 5 బేసిస్ పాయింట్లు పెంచింది. 8.40 శాతంనుంచి 8.45 శాతానికి ఎంసీఎల్‌ఆర్‌ను పెంచింది. ఈ సవరించిన వడ్డీరేట్లు జూన్ 7 నుంచి  అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఒకరోజు, ఒక నెల, మూడు నెలలు ,  ఆరు నెలల కాల పరిమితి రుణాలపై వడ్డీరేటు రుసగా 7.95 శాతం, 8 శాతం, 8.1 శాతం, 8.3 శాతం ఉండనుంది.  ఆర్‌బీఐ  ద్వైమాసిక  పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందన్న అంచనాల నేపథ్యంలో బీఓబీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల, ఎస్‌బీఐ,  పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్‌, ఐసీఐసీఐ,  హెచ్‌డీఎప్‌సీ సహా కొన్ని బ్యాంకులు తమ ఎంసిఎల్ఆర్‌ను పెంచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసీఎల్‌ఆర్‌తో ముడిపడివున్న గృహ, వాహన రుణాలు ఇకపై మరింత భారం కానున్నాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement