స్పెక్ట్రం వేలంతో వచ్చే ఏడాది రూ. 39వేల కోట్ల లక్ష్యం | 39000 crores target for next year spectrum auction | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రం వేలంతో వచ్చే ఏడాది రూ. 39వేల కోట్ల లక్ష్యం

Feb 18 2014 1:27 AM | Updated on Sep 2 2017 3:48 AM

స్పెక్ట్రం వేలంతో వచ్చే ఏడాది రూ. 39వేల కోట్ల లక్ష్యం

స్పెక్ట్రం వేలంతో వచ్చే ఏడాది రూ. 39వేల కోట్ల లక్ష్యం

వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం వేలంతో పాటు సంబంధిత ఫీజులు మొదలైన వాటి రూపంలో రూ. 38,954 కోట్లు సమీకరించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్రం నిర్దేశించుకుంది.

 న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో టెలికం స్పెక్ట్రం వేలంతో పాటు సంబంధిత ఫీజులు మొదలైన వాటి రూపంలో రూ. 38,954 కోట్లు సమీకరించాలని ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేంద్రం నిర్దేశించుకుంది. ఇటీవలే ముగిసిన 2జీ స్పెక్ట్రం వేలం అంచనాలను మించి విజయవంతం కావడం... రూ. 61,162 కోట్ల మేర బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 18,296 కోట్లు రాగలవని అంచనా.
 

Advertisement
 
Advertisement
Advertisement