వైఎస్‌కు కుటుంబ సభ్యుల ఘననివాళి | YSR's family members pray at Idupulapaya | Sakshi
Sakshi News home page

వైఎస్‌కు కుటుంబ సభ్యుల ఘననివాళి

Sep 3 2013 2:22 AM | Updated on Jul 7 2018 2:52 PM

వైఎస్‌కు కుటుంబ సభ్యుల ఘననివాళి - Sakshi

వైఎస్‌కు కుటుంబ సభ్యుల ఘననివాళి

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.

ఇడుపులపాయ, న్యూస్‌లైన్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్ధంతి సందర్భంగా సోమవారం ఇడుపులపాయలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ సతీమణి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిల్లలు, షర్మిల భర్త బ్రదర్ అనిల్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎస్టేట్ ఇన్‌చార్జి వైఎస్ కొండారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ రాజారెడ్డి సోదరి కమలమ్మ, రవీంద్రనాథరెడ్డ్డిలతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు వైఎస్సార్ ఘాట్‌లోని మహానేత సమాధి వద్ద కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇడుపులపాయలోని చర్చి ఫాదర్ రవికిరణ్ ప్రార్థనలు చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద విజయమ్మ, షర్మిల మౌనంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురై కంటితడి పెట్టారు.
 
 పెద్దాయనకు ప్రముఖుల నివాళి: వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన వారిలో జిల్లా వైఎస్సార్‌సీపీ కన్వీనర్ సురేష్‌బాబు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, కాకినాడ, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, చంద్రశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిలతోపాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పురుషోత్తంరెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వాసిరెడ్డి పద్మ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement