'నన్ను చంపెయ్యరని గ్యారెంటీ ఏంటి?' | ysrcp mla roja press meet | Sakshi
Sakshi News home page

'నన్ను చంపెయ్యరని గ్యారెంటీ ఏంటి?'

Feb 11 2017 6:35 PM | Updated on Jul 28 2018 3:33 PM

'నన్ను చంపెయ్యరని గ్యారెంటీ ఏంటి?' - Sakshi

'నన్ను చంపెయ్యరని గ్యారెంటీ ఏంటి?'

జాతీయ మహిళా సాధికారత సదస్సు అని ఆహ్వానం పంపి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు.

జాతీయ మహిళా సాధికారత సదస్సు అని ఆహ్వానం పంపి విమానాశ్రయంలో తనను ఓ టెర్రరిస్టులా అరెస్టు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. శనివారం సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలో ఆపి బాంబులు, తుపాకులు, కత్తులు ఉన్న వారిలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వ చిన్నచూపును వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం తనను చంపెయ్యదని గ్యారెంటీ ఏంటి? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
 
ప్రెస్‌ మీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రోజా మాటల్లోనే..
* ఒక శాసనసభ  సభ్యు రాలికి ఏపీలో రక్షణ లేదు.
* రాష్ట్ర డీజీపీ మాటలు సిగ్గుచేటు. 
* సదస్సు ఎందుకు పెట్టారయ్యా? బ్రహ్మణి, వెంకయ్య కూతర్ల పబ్లిసిటీ కోసమా?. ప్రజలు పన్ను కట్టిన డబ్బును వినియోగించి మహిళాసాధికారత ఎలా సాధించాలి అనే అంశంపై చర్చిస్తారనుకుంటే మీటింగ్‌ కు రానీకుండా అరెస్టు చేయించారు.
* సీఎం చంద్రబాబు, స్పీకర్‌ కోడెలకు నేనంటే ఎందుకంత భయం.
* ప్రతిపక్షం ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటుంది. అసెంబ్లీలో మీ జీవితం మొత్తం నన్ను సస్పెండ్‌ చేయడానికే సరిపోయింది. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై రెండు రోజులు మాట్లాడితే ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement