తుపాన్ భాదితులను పరామార్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Meet On Cyclone Victims | Sakshi
Sakshi News home page

తుపాన్ భాదితులను పరామార్శించిన వైఎస్సార్‌సీపీ నేతలు

Dec 17 2018 3:21 PM | Updated on Dec 17 2018 7:51 PM

సాక్షి, తూర్పు గోదావరి: పెథాయ్‌ తుపాన్‌ తీరం తాకడంతో కాకినాడలో తుపాన్‌ భాదితులను పరామర్శించిన వైస్సాఆర్‌సీపీ నాయకులు. కాకినాడ సిటీ కోఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖర్‌, పిఠాపురం కోఆర్డినేటర్‌ పెండెం దొరబాబు దుమ్ములపేట, పిఠాపురం గ్రామాల్లో పర్యటించారు. వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల కుటుంబాలను కలసి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం మాకు ఎటువంటి సహయక చర్యలు తీసుకోలేదని భాదితులు వాపోయారు. తాగడానకి మంచి నీరు, వంటి సహయక చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు . తుపాన్ భాదితులకు బిస్కెట్లు, మంచి నీళ్ల పాకెట్లు అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించడానికి ప్రభుత్వం వెంటనే సహయక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement