♦ సీఎం చంద్రబాబుకు వైఎస్సార్ సీపీ నాయకుల సవాల్
♦ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య
♦ అవినీతి సొమ్ముతో దౌర్జన్యాలు చేస్తున్నారని విమర్శ
గజపతినగరం రూరల్ : అవినీతి, అక్రమాలతో ప్రజల పొట్ట కొట్టి కూడబెట్టుకున్న డబ్బుతో ప్రతిపక్ష నాయకులపై దాడులు చేస్తూ సంబరాలు చేసుకోవడం ఇక ఎంతో కాలం కొనసాగదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీని భూ స్థాపితం చేస్తారని సాలూరు ఎమ్మెల్యే పీడీక రాజన్నదొర వ్యాఖ్యానించారు. సోమవారం గజపతినగరంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది. ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ ప్లీనరీలో చేసిన తీర్మానాలను, పార్టీ చేయబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అవినీతి, లంచగొండితనం రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో దొరికి పోయి, అక్రమంగా డబ్బులు సంపాదించి, కొడుకును దొడ్డిదారిన మంత్రిని చేసిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. బాబు తాను చేసిన అభివృద్ధిపై నమ్మకముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు.
టీడీపీ వారు నారా లోకేష్కు, వైఎస్ జగన్కు పోలిక పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబుకు వెన్ను పోటు రాజకీయాలు తెలిసినందునే పార్టీ ఫిరాయింపులకు ప్రా ధాన్యమిచ్చి ఇతర పార్టీలోనుంచి వచ్చిన వారిని మంత్రిని చేశారని విమర్శించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన మాట్లాడుతూ తోటపల్లి కెనాల్కు రూ.700 కోట్లు విడుదల చేసి వైఎస్ రాజశేఖరెడ్డి రైతులకు ఆసరాగా నిలిస్తే టీడీపీ పది శాతం నిధులు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు.
ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదవాడికి ఇళ్లు, ఆరోగ్య శ్రీ లాంటి సంక్షేమ పథకాలు భరోసా నిస్తే ఇప్పుడు ఆ పథకాలు ఎక్కడ కనిపించడం లేదని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య మాట్లాడుతూ రాజధాని పేరుతో విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా విచారణలు జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్ష నేత పరామర్శకు వెళ్తే కేసులు పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం
Published Tue, Jun 6 2017 5:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
కమిన్స్ మాటలు విని షాకైన హార్దిక్! వీడియో వైరల్
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
చంద్రబాబుపై రైతుల ఆగ్రహం
ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అతి ప్రవర్తన.. ఇందులో నిజమెంత..?
పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
Satya Movie: ఆకట్టుకుంటున్న ‘నిజమా ప్రాణమా ..’ సాంగ్
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
తప్పక చదవండి
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement