ఏలూరు (ఆర్ఆర్పేట) :రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు నిరాశకు గురై ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులు బొత్సా సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు, దందాలు చేస్తున్నారని విమర్శించారు.
15 నెలల వారి పాలనలో రాష్ట్రంలో అధికారులు, మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. కాల్మనీ పేరుతో టీడీపీ నాయకులు మహిళలను వ్యభిచార కూపంలోకి దింపడం దురదృష్టకరమన్నారు. మహిళల అభివృద్ధి కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ వడ్డీలేని రుణాలు అందించారని, చంద్రబాబు అసలు రుణాలు ఇవ్వకుండా మహిళల జీవనంపై ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. అంగన్వాడీలు ఆందోళన చేస్తే వారిని మగ పోలీసులతో ఈడ్పించి వేయడం అత్యంత హేయమన్నారు.
శాసన సభ సమావేశాల్లో తమ సమస్యల పరిష్కారంపై చర్చిస్తారని ఆశించిన వర్గాలను ఈ సర్కారు నిరాశపరిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిణామాలు, ఒకప్పుడు దేశంలోని నాగాలాండ్, మేఘాలయ, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో జరిగిన పరిణామాల్లా ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన జన చైతన్య యాత్రల వల్ల ప్రజలకు ఒరిగిందేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతమై సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేసిన విధానం దురదృష్టకరమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్యే మోషేన్రాజు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి, నగర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.జాన్ గురునాథ్, పి.ప్రసాద్, ఎం.సదానంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు పాలనపై అంతటా అసంతృప్తి
Published Mon, Dec 21 2015 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement