విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్: విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉద్రిక్తంగా మారింది. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో మేయర్ అధికార తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలకడంతో వైఎస్ఆర్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు.
కౌన్సిల్ తీర్మానాలపై వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్ బహుదూర్ మేయర్ను నిలదీశారు. మేయర్ బహుదూర్ను సస్పెండ్ చేయడంతో మేయర్ చాంబర్ ముందు ఆయన బైఠాయించారు. మార్షల్స్ వచ్చి బహుదూర్ను బయటకు ఈడ్చుకెళ్లారు. దీనిపై వైఎస్ఆర్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేస్తూ సభను వాకౌట్ చేశారు.