185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

YS Jagan Praja Sankalpa Yatra Day 185 Schedule - Sakshi

సాక్షి, నిడదవోలు: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 185వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. ఆదివారం ఉదయం ఆయన నిడదవోలు నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి ధారవరం, మర్కొండపాడు, చంద్రవరం, మల్లవరం, గౌరిపల్లి మీదగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు పార్టీ  జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ముగిసిన 184వ రోజు పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 184వ రోజు పాదయాత్రను ముగించారు. ఇవాళ ఆయన 12.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కలవచర్ల, డి.ముప్పవరం, సమిశ్రగూడెం మీదగా నిడదవోలు వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. వైఎస్‌ జగన్‌ ఇప్పటివరకూ 2,283.8 కిలోమీటరు నడిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top